రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-04-21T05:35:05+05:30 IST
మండలంలోని నూలుమిల్లు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొణిదేడు గ్రామానికి చెందిన మద్దూరు ఇబ్రహీం (50) మృతి చెందినట్లు పాణ్యం ఎస్ఐ రాకేష్ తెలిపారు.
పాణ్యం, ఏప్రిల్ 20: మండలంలోని నూలుమిల్లు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొణిదేడు గ్రామానికి చెందిన మద్దూరు ఇబ్రహీం (50) మృతి చెందినట్లు పాణ్యం ఎస్ఐ రాకేష్ తెలిపారు. ఇబ్ర హీం నూలుమిల్లు ఎదురుగా నిర్మిస్తున్న భవనానికి వాచ్మన్గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి నంద్యాల వైపుకు వెళ్తున్న వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య లాలూబీ, నలుగురు కుమార్తెలు ఉన్నారన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.