రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-03-09T07:02:44+05:30 IST
రోడ్డు ప్రమాదంలో రేపాకగొమ్ముకు చెందిన జోడే సత్యనారాయణ (45) అనే వ్యక్తి మృతి చెందాడు.
వేలేరుపాడు, మార్చి 8: రోడ్డు ప్రమాదంలో రేపాకగొమ్ముకు చెందిన జోడే సత్యనారాయణ (45) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానిక సబ్స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి బైక్పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న సత్యనారాయణ తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే వేలేరుపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం 108పై జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణ అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఆటో డ్రైవర్ ఆటోను అక్కడే వదిలి పరారయ్యాడు. ఎస్ఐ రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.