రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-04-24T05:10:39+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డ సంఘటన గురువారం రాత్రి మండలంలోని రాజుపాలెం సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని రాజుపాలెంకు చెందిన ఐదుగురు ఆటోలో మార్కాపురం నుంచి స్వగ్రామం వెళుతున్నారు. దరిమడుగు సమీపంలోకి ఒక ప్రైవేటు స్కూల్ సమీపంలో లగేజీ ఆటో ఎదురుగా వచ్చింది.
నలుగురికి గాయాలు
మార్కాపురం, ఏప్రిల్ 23: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డ సంఘటన గురువారం రాత్రి మండలంలోని రాజుపాలెం సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని రాజుపాలెంకు చెందిన ఐదుగురు ఆటోలో మార్కాపురం నుంచి స్వగ్రామం వెళుతున్నారు. దరిమడుగు సమీపంలోకి ఒక ప్రైవేటు స్కూల్ సమీపంలో లగేజీ ఆటో ఎదురుగా వచ్చింది. ఆ సమయంలో ఆటో రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి వెళ్లింది. ఈ సంఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మాకం వెంకటయ్య(45) మృతి చెందాడు. మెరుగైన వైద్యం కోసం మిగిలిన క్షతగాత్రులలో జమ్మలమూడి నాగరాజును నరసరావుపేటకు, విన్నాసి, చిరంజీవి, ప్రకాష్ విజయ్లను ఒంగోలు తరలించారు. రూరల్ ఎస్సై కోటయ్య కేసు నమోదు చేశారు.