కారు ఢీకొని ఇద్దరి దుర్మరణం

ABN , First Publish Date - 2022-05-11T16:03:57+05:30 IST

రోడ్డు పక్కన మాట్లాడుకుంటున్న వారిపై కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. రాజపాళయం మలయడిపట్టికి చెందిన అయ్యనార్‌ (31), కమ్మాపట్టికి

కారు ఢీకొని ఇద్దరి దుర్మరణం

పెరంబూర్‌(చెన్నై): రోడ్డు పక్కన మాట్లాడుకుంటున్న వారిపై కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. రాజపాళయం మలయడిపట్టికి చెందిన అయ్యనార్‌ (31), కమ్మాపట్టికి చెందిన రామసుబ్రమణియన్‌ (35) ఎలక్ట్రీషియన్‌లుగా పనిచేస్తున్నారు. వీరు మంగళవారం శ్రీవిల్లిపుత్తూర్‌ సమీపంలోని ఓ ఇంట్లో ఎలక్ట్రిక్‌ పనుల కోసం మోటార్‌సైకిల్‌పై బయల్దేరారు. లక్ష్మిపురం సమీపంలో రోడ్డు పక్కన బైక్‌ నిలిపిన వీరు మాట్లాడుకుంటున్న సమయంలో ఆ మార్గంగా వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి వీరిపై దూసుకుపోయింది. మోటార్‌సైకిల్‌తో పాటు కారు బ్రిడ్జి నుంచి కిందకు పడింది. ఈ ఘటనలో అయ్యనార్‌, రామసుబ్రమణియన్‌ సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై నత్తంపట్టి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Read more