Accident: రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్ల మృతి

ABN , First Publish Date - 2022-09-16T14:06:01+05:30 IST

ఆంబూరు సమీపంలో స్కూటర్‌ను సరుకు లారీ ఢీకొన్న ఘటనలో అక్కాచెల్లెళ్లు మృతిచెందారు. వీరాంకుప్పం పంచాయతీ మంగళం జంక్షన్‌ మె

Accident: రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్ల మృతి

వేలూరు(చెన్నై), సెప్టెంబరు 15: ఆంబూరు సమీపంలో స్కూటర్‌ను సరుకు లారీ ఢీకొన్న ఘటనలో అక్కాచెల్లెళ్లు మృతిచెందారు. వీరాంకుప్పం పంచాయతీ మంగళం జంక్షన్‌ మెయిన్‌ రోడ్డుకు చెందిన దండపాణి-అనూరాధ దంపతులకు జయశ్రీ (18), వర్ష (11) అనే ఇద్దరు కుమార్తెలున్నారు. గోవిందాపురం(Govindapuram)లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్న వారిద్దరూ  ప్రతిరోజు పాఠశాల వాహనంలో వెళ్లి వస్తుంటారు. గురువారం వాహనం వెళ్లిపోవడంతో దండపాణి పిల్లలిద్దర్నీ స్కూటర్‌పై ఎక్కించుకొని పాఠశాలకు బయల్దేరాడు. ఆంబూరు ఏఆర్‌ థియేటర్‌ సిగ్నల్‌ సమీపంలో లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని అటువైపు వస్తున్న దండపాణి స్కూటర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో స్కూటరు వెనుక కూర్చున్న అక్కాచెల్లెళ్లిద్దరూ తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఈ ప్రమాదం అనంతరం పారిపోయేందుకు యత్నించిన లారీ డ్రైవర్‌ను ప్రజలు పట్టుకొని దేహశుద్ధి చేశారు. దాడిలో గాయపడిన డ్రైవర్‌ ఆంబూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఆంబూరు పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.

Updated Date - 2022-09-16T14:06:01+05:30 IST