రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళల మృతి

ABN , First Publish Date - 2022-06-12T13:41:51+05:30 IST

శివగంగ జిల్లా కారైక్కుడి సమీపం తిరుచ్చి-రామేశ్వరం జాతీయ రహదారిపై శనివారం ఉదయం నిలిపివున్న లారీని వ్యాన్‌ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మహిళలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళల మృతి

                   - నలుగురు చిన్నారులు సహా 21 మందికి గాయాలు


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 11: శివగంగ జిల్లా కారైక్కుడి సమీపం తిరుచ్చి-రామేశ్వరం జాతీయ రహదారిపై శనివారం ఉదయం నిలిపివున్న లారీని వ్యాన్‌ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మహిళలు మృతిచెందగా, నలుగురు చిన్నారులు సహా 25 మంది గాయపడ్డారు. శివగంగ జిల్లా పూచ్చియేందల్‌ గ్రామానికి చెందిన 25 మంది కారైక్కుడిలో జరుగుతున్న బంధువుల సీమంతం కార్యక్రమంలో పాల్గొనేందుకు వ్యానులో బయల్దేరారు. వ్యాన్‌ కారైక్కుడి-తిరుచ్చి జాతాయ రహదారిలోని కొత్త రిజిస్ట్రేషన్‌ కార్యాలయం సమీపంలో వస్తుండగా హఠాత్తుగా డ్రైవర్‌ అదుపుతప్పి రోడ్డు పక్కనే నిలిపివుంచిన లారీని ఢీకొంది. ఈ ఘటనలో మణిమేఘలై (55) సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, ఆసుపత్రిలో చికిత్సలు ఫలించక తవప్రియ (22), పాప్పాత్తి (60)లు మృతిచెందారు. ఈ ఘటనలో గాయపడిన నలుగురు చిన్నారులు సహా 25 మంది కారైక్కడి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒక చిన్నారి, అతని తల్లి, మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మదురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కారైక్కుడి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-06-12T13:41:51+05:30 IST