రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి
ABN , First Publish Date - 2022-06-11T01:26:45+05:30 IST
చిత్తూరు: చిత్తూరు జిల్లా మురుకంబట్టుకు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. చిత్తూరుకు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు రాహుల్,
చిత్తూరు: చిత్తూరు జిల్లా మురుకంబట్టుకు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. చిత్తూరుకు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు రాహుల్, తేజస్ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ చనిపోయారు.