దంపతులకు తీవ్రగాయాలు
ABN , First Publish Date - 2021-04-23T05:23:15+05:30 IST
మండలంలోని కొత్తూరు వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.
కోడుమూరు(రూరల్), ఏప్రిల్ 22: మండలంలోని కొత్తూరు వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. దేవనకొండ మండలంలోని కొత్తపేటకు చెందిన దంపతులు సోమశేఖర్, సంధ్య జీవనోపాధి నిమిత్తం నంద్యాలలో ఉంటున్నారు. గురువారం స్వగ్రామం లో పని నిమిత్తం బైక్పై బయలుదేరారు. మార్గమధ్యంలో కొత్తూరు వద్ద బైక్ అదుపుతప్పి వంతెనను ఢీకొట్టింది. దంపతులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వాహనదారులు క్షతగాత్రులను పెంచికలపాడు క్యాన్సర్ అసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కర్నూలు తీసుకెళ్లాలని సూచించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. ఎస్ఐ మల్లికార్జున మాట్లాడుతూ క్షతగాత్రులు కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నారని తెలిపారు.