గుంతపూడ్చిన అధికారులు

ABN , First Publish Date - 2021-07-24T06:21:16+05:30 IST

పట్టణంలోని టకారిపాలెం, కొత్తూరు వద్ద జాతీయ రహదారిపై గుంతలు ఏర్పడి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం డాక్టర్‌ ఉగ్ర దృష్టికి వచ్చింది గురువారం ఆయన ప్రాంతాలకు వెళ్లి పరిశీలించిన సంగతి తేలిసిందే.

గుంతపూడ్చిన అధికారులు
చింతపాలెం రోడ్డును పరిశీలిస్తున్న ఉగ్ర

కనిగిరి, జూలై 23: పట్టణంలోని టకారిపాలెం, కొత్తూరు వద్ద జాతీయ రహదారిపై గుంతలు ఏర్పడి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం డాక్టర్‌ ఉగ్ర దృష్టికి వచ్చింది గురువారం ఆయన ప్రాంతాలకు వెళ్లి పరిశీలించిన సంగతి తేలిసిందే. దీంతో ఎట్టకేలకు స్పందించినపాలకులు, అధికారులు స్పందించారు. శుక్రవారం గుంతనుపూడ్చి ప్యాచ్‌ వర్క్‌చేశారు. కనిగిరిలోని ప్రధాన రోడ్ల దుస్థితిపై శనివారం ఆయన నియోజకవర్గం పర్యటన చేయనున్నారన్న సమాచారంతో అధికారులు వేగంగా స్పందించారు. ఈ మేరకు శుక్రవారం టకారిపాలెం, కొత్తూరు వద్ద హైవే రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. 

ఏంటీ ఈ రోడ్ల దుస్థితి : పట్టణ సమీపంలోని శంఖవరం వద్ద కందుకూరురోడ్డు, చింతలపాలెంకు వెళ్ళే రోడ్డు కోసుకు పోయి భారీ గుంత ఏర్పడి ఉండటాన్ని డాక్టర్‌ ఉగ్ర టీడీపి శ్రేణులతో కలసి శుక్రవారం పరిశీలించారు. రోడ్ల దుస్థితి చూసి అసహనం వ్యక్తం చేశారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టినందువలన తిరిగి మళ్లీ వర్షాలకు గుంతలు ఏర్పడుతున్నాన్నారు. తారు కంకరతో పటిష్టంగా మరమ్మతులు చేస్తేనే ఫలితం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-24T06:21:16+05:30 IST