అటుగా వెళితే పడిపోతారు..!

ABN , First Publish Date - 2021-10-25T05:26:57+05:30 IST

అధికారులు నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారింది..

అటుగా వెళితే పడిపోతారు..!
మ్యాన్‌హోల్‌లో దిగబడిపోయిన వ్యాన్‌

ఆకివీడులో కనీసం కానరాని హెచ్చరిక బోర్డులు



ఆకివీడు, అక్టోబరు 24 : అధికారులు నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారింది.. గతంలో ఎక్కడైనా గొయ్యి పడితే అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించేవారు. ప్రస్తుతం అటువంటిదేం కనిపించడం లేదు. ఎవడి దారిన వాడుపోతాడులే అన్నట్టు ఉంది పరిస్థితి. దీంతో వాహన దారులు గోతుల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఆకివీడులో ఆదివారం ఎదురైన సంఘటనే దీనికి నిదర్శనం. ఇటీవల ఆకివీడు నుంచి అయి–భీమవరం రహదారి అభివృద్ధి పనులు చేశారు.అయితే మ్యాన్‌హోల్స్‌ పనులు చేయకుండా వదిలేశారు. అక్కడ ఏదైనా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారా అంటే అదీలేదు.దీంతో వాహనదారులు మ్యాన్‌హోల్స్‌లో పడి గాయాల పాలవుతు న్నారు. ఆదివారం ఒక వ్యాన్‌ మ్యాన్‌హోల్‌లో దిగబడింది. ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో ట్రాక్టర్‌కు తాడుకట్టి బయటకు తీశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-10-25T05:26:57+05:30 IST