రోడ్డు మరమ్మతు చేపట్టారు...

ABN , First Publish Date - 2021-07-30T04:59:20+05:30 IST

రోడ్డు మరమ్మతు చేపట్టారు...

రోడ్డు మరమ్మతు చేపట్టారు...
మరమ్మతు తర్వాత ఇలా...

- ‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌

టెక్కలి : వేసిన కొద్ది రోజుల్లోనే ఊడిపోయిన తారురోడ్డుకు అధికారులు మరమ్మతులు చేయించారు. పది రోజుల్లోనే ‘తారు’ మారు... అంటూ బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్‌తో యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేయించారు. జాతీయ రహదారి నుంచి వయా కాపుతెంబూరు, నౌగాం వరకు 5.67 కిలోమీటర్ల ఈ తారురోడ్డు ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద రూ.3.67 కోట్లతో నిర్మాణం చేపట్టారు. వేసిన పదిరోజుల వ్యవధిలోనే ఎక్కడికక్కడ ముక్కలు ఊడిపోయిన సంగతి ‘ఆంధ్రజ్యోతి’ ద్వారా పాఠకులకు తెలిసిందే.  


 

Updated Date - 2021-07-30T04:59:20+05:30 IST