తాలిబన్లే లక్ష్యంగా బాంబుదాడి.. కానీ..

ABN , First Publish Date - 2021-10-24T01:28:50+05:30 IST

తాలిబన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన బాంబు దాడిలో ఇద్దరు పౌరులు

తాలిబన్లే లక్ష్యంగా బాంబుదాడి.. కానీ..

కాబూల్: తాలిబన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన బాంబు దాడిలో ఇద్దరు పౌరులు మరణించారు. వీరిలో ఒక చిన్నారి కూడా ఉన్నాడు. ఈ ఘటనలో మరో నలుగురు ప్రాణాలు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లో ఈ ఘటన జరిగినట్టు జిల్లా పోలీస్ చీఫ్ ఇస్మాతుల్లా ముబాజిర్ తెలిపారు.


తాలిబన్ల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని రోడ్డు పక్కన పాతిపెట్టిన రెండు బాంబులను పేల్చినట్టు చెప్పారు. అయితే, ఈ ఘటనలో తాలిబన్ ఫైటర్లు ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తెలిపారు. తూర్పు నంగర్‌హార్‌ ప్రావిన్సులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నప్పటికీ ఆ దాడికి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు. ఇక్కడ తాలిబన్లే లక్ష్యంగా తరచూ దాడులు జరుగుతున్నాయి.

Updated Date - 2021-10-24T01:28:50+05:30 IST