హైవేపై కారులో NRI ప్రయాణం.. కారు ఆపమంటూ యువతి సైగలు.. చివరకు..

ABN , First Publish Date - 2022-04-13T03:18:26+05:30 IST

ఓ ఎన్నారైని గన్నుతో బెదిరించి దోపిడీ దొంగలు ఆయన కారును ఎత్తుకుపోయారు.

హైవేపై కారులో NRI ప్రయాణం.. కారు ఆపమంటూ యువతి సైగలు.. చివరకు..

ఎన్నారై డెస్క్: ఓ ఎన్నారైని గన్నుతో బెదిరించి దోపిడీ దొంగలు ఆయన కారును ఎత్తుకుపోయారు. పంజాబ్ నగరంలోని కపుర్తలా జిల్లాలోగల ఫగ్వారా నగరానికి సమీపంలో సోమవారం ఈ దారుణం జరిగింది. బాధితుడు జర్నైల్ సింగ్.. లడ్డియన్-నమోజ్రా రహదారిపై క్రెటా కారులో ప్రయాణిస్తుండగా.. రహదారి పక్కన నిలబడ్డ ఓ యువతి కారు ఆపమంటూ సైగ చేసింది. దీంతో.. జర్నైల్ సింగ్ ఆమె కోరినట్టే కారు ఆపారు. ఈ క్రమంలో అక్కడి పొలాల్లో దాక్కున్న ముగ్గురు వ్యక్తులు హఠాత్తుగా ఆయనను సమీపించారు. కారు దిగిపోవాలంటూ గన్నుతో బెదిరించారు. 


దిక్కుతోచని స్థితిలో జర్నైల్ సింగ్ వారు చెప్పినట్టే చేశారు. ఆ తరువాత.. వారు కారుతో పాటూ పరారయ్యారు. అయితే.. జర్నైల్ సింగ్ ఫోన్ కారులోనే ఉండిపోయిన విషయాన్ని గుర్తించిన దోపిడీదారులు పోలీసులు తమను ట్రాక్ చేయకుండా ఉండేందుకు ఫోన్‌ను మార్గమధ్యంలోనే పారేశారు. బాధితుడు చివరకు స్థానికుల సాయంతో జరిగిన దారుణం గురించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితులను పట్టుకునేందుకు వారు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు పారేసిన ఫోన్ కూడా వారికి ఘటనాస్థలానికి కొంత దూరంలో దొరికింది. 

Updated Date - 2022-04-13T03:18:26+05:30 IST