రోడ్డు గుంతలను పూడ్చుకున్న గ్రామస్థులు
ABN , First Publish Date - 2022-08-12T03:42:01+05:30 IST
మండలంలోని కుంకువారిపాలెం నుంచి తిమ్మసముద్రం వరకు ఉన్న లింకురోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో గ్రామ
కొండాపురం, ఆగస్టు11: మండలంలోని కుంకువారిపాలెం నుంచి తిమ్మసముద్రం వరకు ఉన్న లింకురోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో గ్రామస్థులు స్వచ్ఛందంగా గ్రావెల్తో గుంతలను పూడ్చుకున్నారు. 5 కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డులో దాదాపు 3 కిలోమీటర్ల దూరం గుంతలు ఏర్పడి మోటారుసైకిళ్లు వెళ్లేందుకుకూడా వీలులేకుండా మారిందని, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తామే ముందుకువచ్చి ఈ కార్యక్రమం చేపట్టామని గ్రామస్థుడు బొట్లగుంట హరిబాబు గురువారం తెలిపారు. రెండు రోజులపాటు శ్రమించి గుంతలను పూడ్చామన్నారు. తాను సుమారు రూ 25 వేలు వెచ్చించగా గ్రామస్థులు వర్ధినేని రాఘవులునాయుడు, కుంకు దర్గాబాబు, గొట్టిపాటి మహేశ్వరరావు, వర్ధినేని వీరాస్వామి తదితరులు సహకారం అందించారని ఆయన తెలిపారు.