బీజేపీ, టీఆర్ఎస్ నేతలవి డ్రామాలు : రోహిత్రెడ్డి
ABN , First Publish Date - 2022-04-12T19:11:36+05:30 IST
ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా బీజేపీ, టీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ నేత రోహిత్రెడ్డి అన్నారు.
హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా బీజేపీ, టీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ నేత రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజని కేసీఆర్ కొనాలని డిమాండ్ చేశారు.టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే విద్యుత్ చార్జీలు తగ్గించాలని రోహిత్రెడ్డి కోరారు.