కెప్టెన్‌గా రోహిత్ అర్ధ సెంచరీ.. విజయం దిశగా భారత్

ABN , First Publish Date - 2022-02-07T00:03:23+05:30 IST

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు విజయం దిశగా దూసుకెళ్తోంది. విండీస్ నిర్దేశించిన 177 పరుగుల విజయ

కెప్టెన్‌గా రోహిత్ అర్ధ సెంచరీ.. విజయం దిశగా భారత్

అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు విజయం దిశగా దూసుకెళ్తోంది. విండీస్ నిర్దేశించిన 177 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం సాధించింది. కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలి వన్డే ఆడుతున్న రోహిత్ శర్మ అర్ధ సెంచరీ సాధించాడు.


మరోవైపు, ఇషాన్ కిషన్ అతడికి అండగా ఉంటూ పూర్తి సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం రోహిత్ 60, కిషన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 13 ఓవర్లు పూర్తయ్యాయి. వికెట్ నష్టపోకుండా భారత జట్టు 84 పరుగులు సాధించింది. విజయానికి ఇంకా 93 పరుగులు కాగా, కావాల్సినన్ని ఓవర్లు, వికెట్లు చేతిలో ఉన్నాయి. కాబట్టి టీమిండియా విజయం నల్లేరు మీద నడకే.

Updated Date - 2022-02-07T00:03:23+05:30 IST