‘ఇంకా ఏం పీకాలి?’ అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-09-18T14:14:22+05:30 IST
వైసీపీ ఎమ్మెల్యే రోజా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న వ్యాఖ్యలు బాధకరమన్నారు.
తిరుమల: వైసీపీ ఎమ్మెల్యే రోజా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న వ్యాఖ్యలు బాధకరమన్నారు. అయ్యన్న వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. చంద్రబాబు కోడెలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా.. మానసిక క్షోభకు గురిచేసినప్పుడు అయ్యన్న ఏమయ్యారని రోజా ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఎలా వుండాలో జగన్ని చూసి నేర్చుకోవాలన్నారు.
ఆన్లైన్లో సినిమా టిక్కెట్లను విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే జగన్ అమలు చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపులను తొలగించడమే కాకుండా... 33శాతం మద్యం దుకాణాలను ఎత్తివేశారని రోజా పేర్కొన్నారు. అయ్యన్నకు ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి పీకేశారన్నారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి పీకేశారన్నారు. అడ్డదారిన మంత్రి అయ్యిన లోకేశ్ పదవి పీకేశారని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండాను పీకేశారని…ఇంకా ఏం పీకాలని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.