విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఘటన దురదృష్టకరం: రోజా

ABN , First Publish Date - 2022-04-23T22:40:21+05:30 IST

విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఘటన దురదృష్టకరమని మంత్రి రోజా అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఘటన దురదృష్టకరం: రోజా

అమరావతి: విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఘటన దురదృష్టకరమని మంత్రి రోజా అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దిశా చట్టాన్ని ఆమోదించి ఉంటే.. గ్యాంగ్‌రేప్‌ నిందితులను వెంటనే ఉరేసే అవకాశం ఉండేదని తెలిపారు. ఇలాంటి ఘటనలపై రాజకీయాలు చేయడం సరికాదని రోజా సూచించారు.  విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో  మతిస్థిమితం లేని యువతి అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై అత్యాచారం కేసులో ఇద్దరు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో అలసత్వం వహించారంటూ సీఐ హనీష్, సెక్టార్ ఎస్ఐ శ్రీనివాసరావును సీపీ సస్పెండ్ చేశారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో  మానసిక వికలాంగురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటనలో ముందుగా ఫిర్యాదు ఇచ్చినప్పటికీ పోలీసులు అలసత్వం వహించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.  

Updated Date - 2022-04-23T22:40:21+05:30 IST