రోశయ్య సేవలు మరువలేనివి
ABN , First Publish Date - 2021-12-06T05:20:06+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలు మరువలేని వని, ఆయన మృతి తీరనిలోటు అని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు.
గిద్దలూరు, డిసెంబరు 5 : మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలు మరువలేని వని, ఆయన మృతి తీరనిలోటు అని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థిక అం శాలపై మంచి అవగాహన కలిగిన రోశయ్య లేని లోటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలపై ఎంతో ఉంటుందని పేర్కొన్నారు. రోశయ్య నేటితరం నాయకులకు ఆదర్శనీయులని కొనియాడారు.
తీరనిలోటు
సంతాప సభలో వ్యక్తలు
కంభం : అజాత శత్రువుగా పేరుగాంచిన మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతి రాష్ట్రానికి తీరని లోటు అని, ఆయన సేవలు మరువ లేనివని శ్రీశైలం, కాణిపాకం క్షేత్రాల నిత్య అన్న సత్రముల అధ్యక్షుడు ఒగ్గు వెంకటశ్రీనివాసులు అన్నారు. ఆయన అధ్యక్షతన ఆదివారం అన్నసత్రముల ప్రధాన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సంతాప సభలో పలువురు వక్తలు రోశయ్య సేవలను గుర్తు చేసుకున్నా రు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగారపు ఓబయ్య, మాజీ జడ్పీటీసీ జాకీర్, ఎల్ఐసీ బేగ్, టీడీపీ నాయకులు తోట శ్రీనివాసులు, బాదం మనోహర్, తాడువాయి వీరాంజనేయులు, నెమలిదిన్నె చెన్నారెడ్డి, నాగేంద్రుడు పాల్గొన్నారు.
రోశయ్యకు ఎమ్మెల్యే రాంబాబు నివాళి
గిద్దలూరు టౌన్ : సీనియర్ నాయకులు కొణిజేటి రోశయ్య పార్థివదేహానికి ఎమ్మెల్యే అన్నా రాంబాబు నివాళులర్పించారు. ఆదివారం హైదరాబాద్లోని రోశయ్య నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కా యానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనం తరం అన్నా రాంబాబు మా ట్లాడుతూ గొప్ప మేధావిని, ఆ ర్థిక సంస్కరణల కర్తని కోల్పో వడం బాధాకరమన్నారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ శివపురం సురేంద్రకుమార్ ఉన్నారు.
ఆర్యవైశ్యుల అంజలి
పెద్ద దోర్నాల : శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం వద్ద మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కొనిజేటి రోశయ్యకు ఆది వారం ఘనంగా నివాళులర్పిం చారు. కార్యక్రమంలో మండల అ ధ్యక్షుడు పీ సీతారామయ్య, సంఘ ప్రము ఖులు నాగెండ్ల సత్యనారాయణ, దేసు నాగేంద్రబాబు,అన్నా వెంకటప్రసాద్, తొమ్మండ్రు గాంధీ, ఎస్ ప్రసన్న, ఆర్ నరసింహారావు, యక్కలి యోగి నారాయణ, బొగ్గరపు రమేష్,, గుప్త, సుబ్బారావు, పీ సుబ్బారావు పాల్గొన్నారు.
పొదిలిలో నివాళి
పొదిలి : రోశయ్య సేవలు మరువలేనివని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక అమ్మవారి శాలలో జరిగిన సంతాప సభలో రోశయ్య చిత్ర పటానికి పలువురు పూలమాలలు వేసి నివా ళులర్పించారు. కార్యక్రమంలో ఆర్య వైశ్య సం ఘం నాయకులు జీసీ సుబ్బారావు, యక్కలి శేషగిరిరావు, సోమిశెట్టి చిరంజీవి, పమిడిమర్రి తిరుపాలు, రావూరి సుబ్బరాయుడు, కొత్తూరి శ్రీను, వేమా కృష్ణమూర్తి, ఒ.బాలకృష్ణ, రావూరి చెంచయ్య, ఒ.నరేంద్ర, సునీల్ పాల్గొన్నారు.