నెల్లూరులో రౌడీషీటర్ దారుణహత్య
ABN , First Publish Date - 2020-09-18T15:16:45+05:30 IST
నెల్లూరులో దారుణ ఘటన హత్య జరిగింది. శుక్రవారం ఉదయం రౌడీ షీటర్ బిరియాని బాషాను కొందరు గుర్తు
నెల్లూరు : నెల్లూరులో దారుణ ఘటన హత్య జరిగింది. శుక్రవారం ఉదయం రౌడీ షీటర్ బిరియాని బాషాను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆయన్ను కొందరు దుండగులు కర్రలతో కొట్టి చంపారు. బాషా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. స్థానిక సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలతోనే హత్యచేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నగరంలోని స్కూల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో స్నేహితులే హత్య చేశారని పుకార్లు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.