రౌడీషీటర్‌ దారుణ హత్య

ABN , First Publish Date - 2021-04-23T05:28:42+05:30 IST

నగరంలో మరో రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. కొబ్బరితోటకు చెందిన గనగళ్ల శ్రీనివాస్‌(40)ను కంచరపాలెం పైడిమాంబ ఆలయం సమీపంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తులు కర్రలతో తలపై మోది, పురుషాంగం కత్తిరించి హతమార్చారు. వివరాలా ఉన్నాయి.

రౌడీషీటర్‌ దారుణ హత్య
హత్యకు గురైన రౌడీషీటర్‌ శ్రీనివాస్‌

తలపై మోది, పురుషాంగం కత్తిరించిన గుర్తుతెలియని వ్యక్తులు 

వివాహేతర సంబంధం లేదా స్ర్కాప్‌ గొడవలు కారణమై ఉండవచ్చునని పోలీసుల అనుమానం


విశాఖపట్నం/తాటిచెట్ల పాలెం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజోతి): నగరంలో మరో రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. కొబ్బరితోటకు చెందిన గనగళ్ల శ్రీనివాస్‌(40)ను కంచరపాలెం పైడిమాంబ ఆలయం సమీపంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తులు కర్రలతో తలపై మోది, పురుషాంగం కత్తిరించి హతమార్చారు. వివరాలా ఉన్నాయి.  కొబ్బరితోట మనోరమ థియేటర్‌ ప్రాంతానికి చెందిన గనగళ్ల శ్రీనివాస్‌ స్ర్కాప్‌, చిల్లర దొంగతనాలు, బెదిరించి డబ్బులు దోచుకోవడం వంటి నేరాలకు పాల్పడుతుండేవాడు. దీంతో టూటౌన్‌, కంచరపాలెం, హార్బర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదవడంతో జైలుకు వెళ్లి వచ్చాడు. టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శ్రీనివాస్‌పై రౌడీషీట్‌ ఉంది. శ్రీనివాస్‌కు 16 ఏళ్ల కిందట వివాహమైంది. అయితే అతడి ప్రవర్తనతో విసిగిపోయి భార్య ఐదేళ్ల కిందట విడాకులు తీసుకుంది. దీంతో శ్రీనివాస్‌, తన తండ్రి అచ్చారావుతో కలిసి ఉంటున్నాడు. మద్యం సేవించి జులాయిగా తిరుగుతుంటాడని అతని గురించి తెలిసినవారు చెబుతున్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్‌ గురువారం ఉదయం కంచరపాలెం బ్రిడ్జి వద్ద గల పైడిమాంబ ఆలయం సమీపంలోని దుకాణం ముందు రక్తపుమడుగులో పడి వుండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. కంచరపాలెం సీఐ కృష్ణారావు, క్రైమ్‌ ఏసీపీ సీహెచ్‌ పెంటారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్దగా జనసంచారం ఉండదు కాబట్టి, తెల్లవారుజామున ఎవరైనా హత్య చేసి వుండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాస్‌ను స్ర్కాప్‌ వివాదంలో ఎవరెనా హత్య చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే పురుషాంగం కట్‌ చేసి వుండడంతో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఎవరైనా అలా చేసి ఉంటారా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. 

Updated Date - 2021-04-23T05:28:42+05:30 IST