జంతుప్రదర్శనశాలలో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ మృతి

ABN , First Publish Date - 2021-10-17T06:17:40+05:30 IST

నగరంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనలలోని ఓ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ మృతి చెందిందని జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా తెలిపారు.

జంతుప్రదర్శనశాలలో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ మృతి

గుండెపోటుతో చనిపోయినట్లు క్యూరేటర్‌ వెల్లడి

విశాఖపట్నం, అక్టోబరు 16: నగరంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనలలోని ఓ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ మృతి చెందిందని జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా తెలిపారు. సీత అనే పేరుతో సంరక్షణ పొందుతున్న ఈ పెద్ద పులి వయసు 20 ఏళ్లని తెలిపారు. శనివారం ఉదయం ఎన్‌క్లోజర్‌లోనే ఇది చనిపోయిందని, గుండెపోటుతో చనిపోయినట్లు గుర్తించామని తెలిపారు. కాగా, ఈ పులి గత కొన్నాళ్లుగా ట్యూమర్‌ వ్యాధితో బాధపడుతోందని వివరించారు. 

Updated Date - 2021-10-17T06:17:40+05:30 IST