రాయల్ వర్సెస్ రాయల్స్: బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
ABN , First Publish Date - 2022-04-27T00:45:36+05:30 IST
ఐపీఎల్లో నేడు మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్
పూణె: ఐపీఎల్లో నేడు మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, ఐదో స్థానంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మరికాసేపట్లో మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ మరోమాటకు తావులేకుండా ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. బెంగళూరు జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. వరుసగా విఫలమవుతున్న అనూజ్ రావత్ స్థానంలో రజత్ జట్టులోకి వచ్చాడు.
ఇక, ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేక విమర్శలపాలవుతున్న విరాట్ కోహ్లీ ఈసారి టాపార్డర్లోపైకి వచ్చాడు. ఇది తమకు చాలా కీలక మ్యాచ్ అని, మంచి ప్రదర్శనకు ప్రయత్నిస్తామని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. రాజస్థాన్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. కరుణ్ నాయర్ స్థానంలో డరిల్ మిచెల్, ఒబెడ్ మెక్కాయ్ స్థానంలో కుల్దీప్ సేన్ జట్టులోకి వచ్చారు.