Viral Video: అలా చేయోద్దని ఎంత చెప్పినా వినరా.. తృటిలో తప్పిన ప్రాణాపాయం!

ABN , First Publish Date - 2022-06-23T13:30:05+05:30 IST

సోషల్ మీడియాలో ఓ మహిళకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పోలీసు అధికారి ఎంత చెప్పినా మీరు అతడి మాట వినరా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఇంతకూ ఆ

Viral Video: అలా చేయోద్దని ఎంత చెప్పినా వినరా.. తృటిలో తప్పిన ప్రాణాపాయం!

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఓ మహిళకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పోలీసు అధికారి ఎంత చెప్పినా మీరు అతడి మాట వినరా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఇంతకూ ఆ మహిళ ఎవరు? పోలీసు అధికారి ఆమెకు ఏం చెప్పాడు? నెటిజన్ల కోపానికి కారణం ఏంటి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



ఇష్టం వచ్చినట్టు రైలు పట్టాలను దాటొద్దని.. రైల్వే అధికారులు ప్రజలను హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా కొందరు మాత్రం ఆ హెచ్చరికలను పెడ చెవిన పెడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ పట్టణంలో కూడా ఇదే జరిగింది. వేగంగా దూసుకొస్తున్న రైలును ఓ మహిళ ఏ మాత్రం పట్టించుకోలేదు. అది వొచ్చే లోపు ఈజీగా పట్టాలు దాటేస్తానని భావించింది. స్టేషన్‌లోని రైల్వే పోలీసు అధికారి.. పట్టాలు దాటొద్దని ఎంత హెచ్చరిస్తున్నా ఆమె పట్టించుకోలేదు. ఇంతలో రైలు దూసుకొచ్చింది. ఈ క్రమంలో రైల్వే పోలీసు అధికారి.. ఆ మహిళను ప్లాట్‌ఫాం‌పైకి లాగి..  ప్రాణాపాయం నుంచి ఆమెను బయటపడేశాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో తాజాగా రైల్వే అధికారులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు స్పందిస్తూ.. సదరు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సదరు పోలీసు అధికారిని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 




Updated Date - 2022-06-23T13:30:05+05:30 IST