‘కరోనా’ వైద్యానికి రూ.కోటి విరాళం

ABN , First Publish Date - 2021-05-07T06:28:17+05:30 IST

కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడటానికి రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి రూ.కోటి విరాళం అందించారు.

‘కరోనా’ వైద్యానికి రూ.కోటి విరాళం
కలెక్టర్‌కు రూ.కోటి చెక్కు అందజేస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి

పుంగనూరు రూరల్‌, మే 6: కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడటానికి రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి రూ.కోటి విరాళం అందించారు. ఈ చెక్కును గురువారం పుంగనూరులో కలెక్టర్‌ హరినారాయణన్‌కు అందజేశారు. ఆక్సిజన్‌తోపాటు మందులు కొనుగోలు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలని కోరారు. 

Updated Date - 2021-05-07T06:28:17+05:30 IST