550 చెల్లిస్తే.. ప్రవాసులకు రూ.10 లక్షల బీమా
ABN , First Publish Date - 2021-11-02T13:24:35+05:30 IST
ప్రవాస తెలుగువారు ఏడాదికి రూ.550 చొప్పున చెల్లిస్తే.. రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని ఏపీఎన్ఆర్టీ అధ్యక్షుడు వెంకట్ ఎస్.మేడపాటి తెలిపారు.
ఏపీఎన్ఆర్టీ అధ్యక్షుడు వెంకట్ వెల్లడి
అమరావతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రవాస తెలుగువారు ఏడాదికి రూ.550 చొప్పున చెల్లిస్తే.. రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని ఏపీఎన్ఆర్టీ అధ్యక్షుడు వెంకట్ ఎస్.మేడపాటి తెలిపారు. మూడేళ్లపాటు ఈ స్వల్ప మొత్తం చెల్లిస్తే సరిపోతుందని సోమవారం విలేకరులతో చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి దాదాపు 20 లక్షల మంది విదేశాల్లో ఉన్నారని తెలిపారు. వీరందరికీ ఏ సమస్య వచ్చినా ఏపీఎన్ఆర్టీ నిరంతరం అందుబాటులో ఉండి సేవలందిస్తోందన్నారు. ఈ రెండేళ్లలో ప్రవాసంలో మరణించిన వారి కుటుంబాలకు 1.5 కోట్లు పరిహారంగా అందించినట్లు చెప్పారు. ఆయా దేశాల్లో ప్రవాసాంధ్రులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిరంతరం పనిచేసే హెల్ప్లైన్ నంబ రు 8632340678, వాట్సాప్ నంబరు 8500027678లో సంప్రదించవచ్చన్నారు.