కొవిడ్ బాధితులకు రూ.10 లక్షలు చెల్లించాలి
ABN , First Publish Date - 2021-06-17T05:13:41+05:30 IST
కొవిడ్తో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.10లక్షలు నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ ఆధ్వర్యంలో డీటీ లక్ష్మిదేవికి వినతి పత్రం ఇచ్చారు.
ఎర్రగుంట్ల, జూన్ 16: కొవిడ్తో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.10లక్షలు నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ ఆధ్వర్యంలో డీటీ లక్ష్మిదేవికి వినతి పత్రం ఇచ్చారు. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు .రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎర్రగుంట్ల తహసీల్దార్ కార్యాలయంలో టీడీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ కరోనాకారణంగా దెబ్బతిన్న చిన్నచిన్న వ్యాపారులకు ప్రభుత్వం రూ.10 వేలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి సుంకరనాగేశ్వరరావు, టౌన్ రైతు సంఘం నాయకులు సుబ్రహ్మణ్యం, మండల ప్రధాన కార్యదర్శి నాగభూషణం రెడ్డి పేర్కొన్నారు.