రాచకొండ అభివృద్ధికి రూ.100కోట్లు కేటాయించాలి
ABN , First Publish Date - 2021-07-30T06:57:57+05:30 IST
రాచకొండ పర్యాటక అభివృద్ధికి రూ.100కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని రాచప్ప సమితి ప్రతినిధులు కోరారు.
సంస్థాన్ నారాయణపురం, జూలె ౖ29: రాచకొండ పర్యాటక అభివృద్ధికి రూ.100కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని రాచప్ప సమితి ప్రతినిధులు కోరారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో గురువారం సూరపల్లి వెంకటేశం, నిమ్మల నగేష్, కడారి అంజిరెడ్డి, దోర్నాల శ్రీధర్లు కిషన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాచ కొండను పర్యాటక కేంద్రం ప్రత్యేక జోన్గా తీర్చిదిద్దాలన్నారు. రాచకొండ ఫొటో అల్బమ్ను, జ్ఞాపికను మంత్రికి అందజేశారు. రాచకొండ అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చినట్లు రాచప్ప సమితి ప్రతినిధులు తెలిపారు.