హెల్త్ క్లినిక్లకు రూ.15 కోట్లు విడుదల
ABN , First Publish Date - 2021-10-27T04:47:18+05:30 IST
జిల్లాలో నిర్మిస్తున్న వైఎస్సార్ హెల్త్క్లినిక్ భవన నిర్మాణాలకు రూ.15 కోట్లు విడుదలైనట్లు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి.
కర్నూలు (న్యూసిటీ), అక్టోబరు 26: జిల్లాలో నిర్మిస్తున్న వైఎస్సార్ హెల్త్క్లినిక్ భవన నిర్మాణాలకు రూ.15 కోట్లు విడుదలైనట్లు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి. జిల్లాలోని మూడు డివిజన్లలోని ఆయా గ్రామాల్లో మొత్తం 634 హెల్త్క్లినిక్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఒక్కో భవనానికి రూ.17.50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారని మొత్తం నిర్మాణాలకు రూ.110.95 కోట్లు వ్యయం కానున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 45 భవన నిర్మాణాలు పూర్తికాగా మిగిలిన భవనాలన్ని వేర్వేరు దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయన్నారు. ఈ సంవత్సరం డిసెంబరు నాటికి అన్ని నిర్మాణాలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు.