పెట్రోల్బంకులో రూ.18 వేలు చోరీ
ABN , First Publish Date - 2022-06-27T06:52:55+05:30 IST
పెట్రోల్ బం కులో నగదు చోరీ జరిగింది. చిట్యాల మండ లం గుండ్రాంపల్లిలో జరిగన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చిట్యాలరూరల్, జూన 26: పెట్రోల్ బం కులో నగదు చోరీ జరిగింది. చిట్యాల మండ లం గుండ్రాంపల్లిలో జరిగన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... మండలంలోని గుండ్రాంపల్లి శి వారులో బతుకమ్మ చెరువు పక్కన ఉన్న పె ట్రోల్ బంక్లో ఈ నెల 24వ తేదీన రాత్రి సమయంలో ఇద్దరు విధులు నిర్వహించారు. అర్ధరా త్రి వారు నిద్రలోకి జారుకున్నారు. 25వ తేదీన వేకువజామున 4.20 గంటల ప్రాంతంలో బంకు కార్యాలయంలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. నగదు కోసం మొత్తం వెతికాడు. కంప్యూటర్ టేబుల్ కింద కనబడకుండా దాచిన బ్యాగు నుంచి నగదును తీసుకొని వెళ్లిపోయాడు. కాసేపటికి నిద్రలేచిన సిబ్బంది కాళ్ల వద్ద బ్యాగు ఉండటాన్ని గమనించారు. అందులో నగదు కనిపించకపోవడంతో బంకు యజమానికి సమాచారం అందించారు. ఆయన సూచన మేరకు బంకులో ఉన్న సీసీ టీవీ పుటేజీని పరిశీలించారు. దీంతో ఒక అపరిచితుడు లోపలికి వచ్చి టేబుల్ కింద దాచిన బ్యాగు నుంచి నగదు బ్యాగులోని దొంగిలించి అందులో సుమారు రూ. 18వేల నగదు ఉన్నట్లుగా గుర్తించారు. నగదును దొంగిలించి ఖాళీ బ్యాగును నిద్రిస్తున్న సిబ్బంది కాళ్ల దగ్గర విసిరేసి వెళ్ళిన దృశ్యం సీసీ కెమెరాలో రికార్డయ్యింది. దొంగతనం జరిగిన సంఘటనపై బంకు మేనేజర్ గోపగోని అజయ్ చిట్యాల పోలీ్సస్టేషనలో ఫిర్యాదు చేశారు.