రూ.181 కోట్లతో పాఠశాల భవనాలు

ABN , First Publish Date - 2022-05-06T13:57:13+05:30 IST

నాబార్డు, సమైక్య పాఠశాల విద్యా పథకం కింద వివిధ జిల్లాల్లో రూ.181కోట్లతో నిర్మిచిన పాఠశాల భవనాలు, తరగతి గదులను ముఖ్యమంత్రి స్టాలిన్‌ గురువారం ఉదయం ప్రారంభించారు. నాబార్డ్‌ పథకం

రూ.181 కోట్లతో పాఠశాల భవనాలు

                   - ప్రారంభించిన Cm Stalin


చెన్నై: నాబార్డు, సమైక్య పాఠశాల విద్యా పథకం కింద వివిధ జిల్లాల్లో రూ.181కోట్లతో నిర్మిచిన పాఠశాల భవనాలు, తరగతి గదులను ముఖ్యమంత్రి స్టాలిన్‌ గురువారం ఉదయం ప్రారంభించారు. నాబార్డ్‌ పథకం కింద అరియలూరు, చెంగల్పట్టు, కడలూరు, దిండుగల్‌, ఈరోడ్‌, కరూరు, కన్నియాకుమారి, కృష్ణగిరి, మదురై, నామక్కల్‌, పెరంబలూరు, సేలం, శివగంగ, నీలగిరి తిరువళ్లూరు, తిరువారూరు జిల్లాల్లో రూ.110 కోట్లతో నిర్మించిన కొత్త తరగతి గదులు, ప్రయోగశాలలు, ప్రహరీ, మరుగుదొడ్లను సచివాలయం నుంచి వీడియో కాన్షరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఇదే విధంగా సమైక్య పాఠశాల విద్యా పథకం కింద రూ. 66.98 కోట్లతో నిర్మించిన తరగతి గదులు, ప్రయోగశాల భవనాలను కూడా ఆయన ప్రారంభించారు.


ఐదు గ్రంథాల ఆవిష్కరణ...

సచివాలయంలో జరిగిన మరొ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఐదు గ్రంథాలను ఆవిష్కరించారు. మలయాళంలో అనువదించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’, సెల్లప్పా రచించిన ‘వాడివాసల్‌’ను మలయాళం అనువాద గ్రంథాన్ని, కవయిత్రి వెన్నిలా రచించిన ‘మీదమిరుక్కుం సొర్‌కళ్‌’ గ్రంథాన్ని, పూమణి విరచిత ‘వేంగై’ని ఎడ్మాన్‌ రాజన్‌ మలయాళంలో అనువదించిన గ్రంథాన్ని, ‘ఇమయమ్‌ కథైగళ్‌’ అనే గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్‌. శక్తి, ఎన్‌. సుభిక్ష, ఎం.రుద్రవేల్‌ అనే ముగ్గురు వర్థమాన రచయితకు తలా రూ.25వేల కవిమణి పురస్కారాలను అందజేశారు.

Read more