రూ.2 వేల దొంగనోటు ప్రత్యక్షం...

ABN , First Publish Date - 2021-07-24T07:09:43+05:30 IST

బాన్సువాడ పట్టణంలో గురువారం రాత్రి రూ.2 వేల నోటు ప్రత్యక్షమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.

రూ.2 వేల దొంగనోటు ప్రత్యక్షం...


బాన్సువాడ, జూలై 24 :
బాన్సువాడ పట్టణంలో గురువారం రాత్రి రూ.2 వేల నోటు ప్రత్యక్షమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండలం దేశాయిపేట్‌కు చెందిన ఓ మహిళ వర్నిలో కూలీ పనులకు వెళ్లగా, యజమాని వద్ద రూ.2 వేలు తీసుకుని ఇంటికి వచ్చింది. ఆమె కుమారుడు అనిల్‌ గురువారం రాత్రి మందు కోసం వైన్స్‌కు వెళ్లాడు. వైన్స్‌ యజమానులు దొంగ నోటు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ రామకృష్ణారెడ్డి దొంగ నోటు ఇచ్చిన వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు సమాచారం. దొంగనోటు ఎక్కడి నుంచి వచ్చిందో విచారణలో వెళ్లడవుతుందని తెలిపారు.

Updated Date - 2021-07-24T07:09:43+05:30 IST