చేయూత పథకానికి రూ.324.47 కోట్లు

ABN , First Publish Date - 2021-06-23T05:56:53+05:30 IST

సీఎం జగన్మోహన్‌రెడ్డి మహిళా పక్ష పాతి అని మంత్రి వనిత అన్నారు.

చేయూత పథకానికి రూ.324.47 కోట్లు
చెక్కు అందజేస్తున్న మంత్రి వనిత

ఏలూరు, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్మోహన్‌రెడ్డి మహిళా పక్ష పాతి అని మంత్రి వనిత అన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యా లయం నుంచి సీఎం వర్చువల్‌గా ప్రారంభించిన రెండో దఫా వైఎస్సార్‌ చేయూత పథకం ప్రారంభోత్సవంలో ఆమె ఏలూరు నుంచి పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లా లో 1,73,055 మందికి రూ.324.47 కోట్లు జమ చేశారని తెలిపారు. దెందులూరు ఎమ్మెల్యే  అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ కరోనా సమయంలోను ఆడపడుచులకు ఇచ్చిన హామీని సీఎం నెరవేరుస్తున్నారన్నారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. వీసీలో కలెక్టరేట్‌ నుంచి మంత్రితోపాటు కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, జేసీలు హిమాన్షు శుక్లా, డీఆర్‌డీఏ పీడీ ఉదయభాస్కర్‌, మెప్మా పీడీ ఇమ్మానియేల్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-23T05:56:53+05:30 IST