ఎస్‌ఎ‌స్‌డీసీ సమావేశాలకు రూ.4 కోట్లు

ABN , First Publish Date - 2021-03-01T09:30:59+05:30 IST

దక్షిణాది రాష్ర్టాల అభివృద్ధి మండలి (సదరన్‌ స్టేట్స్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌) సమావేశాలు వచ్చే నెల 4న తిరుపతిలో

ఎస్‌ఎ‌స్‌డీసీ సమావేశాలకు రూ.4 కోట్లు

అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): దక్షిణాది రాష్ర్టాల అభివృద్ధి మండలి (సదరన్‌ స్టేట్స్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌) సమావేశాలు వచ్చే నెల 4న తిరుపతిలో నిర్వహించనున్నారు. సమావేశాల నిర్వహణకు రూ.7.23 కోట్ల అంచనాలతో కలెక్టరు హరినారాయణ్‌ ప్రతిపాదనలు పంపగా.. రూ.4 కోట్లు అడ్వాన్సు మంజూరు చేస్తూ ప్రభుత్వం తరఫున సాధారణ పరిపాలనా శాఖ (ప్రోటోకాల్‌) ముఖ్య కార్యదర్శి (పొలిటికల్‌) ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, పలువురు కేంద్ర మంత్రులు సహా.. ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ర్టాల సీఎంలు సమావేశాలకు హాజరు కానున్నారు. 

Updated Date - 2021-03-01T09:30:59+05:30 IST