విదేశీ విద్యపై గత ప్రభుత్వ హయాంలో రూ.400 కోట్ల అవినీతి: మంత్రి విశ్వరూప్‌

ABN , First Publish Date - 2022-04-05T18:20:04+05:30 IST

మంత్రి విశ్వరూప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ విద్యపై గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్‌ విచారణ చేపట్టామన్నారు.

విదేశీ విద్యపై గత ప్రభుత్వ హయాంలో  రూ.400 కోట్ల అవినీతి: మంత్రి విశ్వరూప్‌

విజయవాడ: విదేశీ విద్యపై టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపైమంత్రి విశ్వరూప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ విద్యపై గత ప్రభుత్వ హయాంలో  జరిగిన అవినీతిపై విజిలెన్స్‌ విచారణ చేపట్టామన్నారు. ఈ విచారణలో రూ.400 కోట్ల అవినీతి జరిగినట్టు తేలిందన్నారు. 400 మంది కాపు విద్యార్థులకు వీసా రిజెక్ట్‌ అయితే వారు వెళ్లినట్టు  టీడీపీ ప్రభుత్వ హయాంలో చూపించారని మండిపడ్డారు. 300 మంది విద్యార్థుల వివరాలు ఇప్పటికీ ట్రేస్‌ కావడం లేదన్నారు. ఇందులోనూ అవినీతి జరిగిందని అనుమానిస్తున్నామని మంత్రి విశ్వరూప్‌ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-04-05T18:20:04+05:30 IST