కువైత్‌లో కిడ్నీ బాధితుడికి రూ.50 వేలు సాయం

ABN , First Publish Date - 2021-01-22T10:36:39+05:30 IST

కిడ్నీ బాధితుడు అంబటి వీర్రాజుకు కువైత్‌ జనసేన ఎన్‌ఆర్‌ఐ సేవా సమితి వారు గురువారం రూ. 50వేలు సా

కువైత్‌లో కిడ్నీ బాధితుడికి రూ.50 వేలు సాయం

రైల్వే కోడూరు, జనవరి 21: కిడ్నీ బాధితుడు అంబటి వీర్రాజుకు కువైత్‌ జనసేన ఎన్‌ఆర్‌ఐ సేవా సమితి వారు గురువారం రూ. 50వేలు సాయం అందించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు రామచంద్రనాయక్‌, పగడాల అంజన్‌కుమార్‌లు మాట్లాడుతూ  వీర్రాజుకు రెండు కిడ్ని లు చెడిపోయి నాలుగు నెలలుగా డయాలసిస్‌కు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. డయాలసిస్‌కు రోజు 10 దినార్లు (ఇండియా కరెన్సీ 2400) ఖర్చు అవుతుందని తెలిసిందన్నారు. సంపాదన లేక, కువైత్‌ దేశం అకామా లేక ఇంటికి పోలేక ఇబ్బందులు పడుతుంటే గుర్తించి సాయం అందించామని తెలిపారు. కార్యక్రమంలో కాంచన, శ్రీకాంత్‌, మాదాసు నరసింహులు, గుంటూరు శంకర్‌, దండు చంద్రశేఖర్‌, ఓబులేశు, రెడ్డిచెర్ల ఆంజనేయులు, అల్లం ప్రేమ్‌, కొమ్మినేని బాలాజీ, బుర్రా శంకర్‌, ఆకుల సుమన్‌, చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-22T10:36:39+05:30 IST