నెలాఖరులోపు రూ.83 లక్షలు చెల్లించాలి
ABN , First Publish Date - 2021-12-04T06:21:45+05:30 IST
సమగ్రశిక్ష పరిధిలో పనిచేసే బోధనేతర ఉద్యోగుల నుంచి కట్ చేసుకున్న పీఎ్ఫ, ఈఎ్సఐ మొ త్తం రూ.83 లక్షలు నెలాఖరులోపు ఉద్యోగులకు చెల్లించాలనీ, లేకుం టే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ఎస్ఎ్సఏ కాంట్రాక్టు, ఔట్ సో ర్సింగ్ ఉద్యోగుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బాల కాశీ, కన్వీనర్ రాజమోహన్, జిల్లా అధ్యక్షుడు విజయ్ హె చ్చరించారు.
లేకుంటే ఆమరణ నిరాహార దీక్షే
ఎస్ఎస్ఏ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు
అనంతపురం విద్య, డిసెంబరు 3: సమగ్రశిక్ష పరిధిలో పనిచేసే బోధనేతర ఉద్యోగుల నుంచి కట్ చేసుకున్న పీఎ్ఫ, ఈఎ్సఐ మొ త్తం రూ.83 లక్షలు నెలాఖరులోపు ఉద్యోగులకు చెల్లించాలనీ, లేకుం టే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ఎస్ఎ్సఏ కాంట్రాక్టు, ఔట్ సో ర్సింగ్ ఉద్యోగుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బాల కాశీ, కన్వీనర్ రాజమోహన్, జిల్లా అధ్యక్షుడు విజయ్ హె చ్చరించారు. శుక్రవారం ఉపాధ్యాయభవన్లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొన్నేళ్లపాటు ఉద్యోగుల పీఎఫ్, ఈఐఎస్ వారి ఖాతాల్లో జమ చేయలేద న్నారు. 9 ఏజెన్సీలు దోపిడీ చేయగా, వారి నుంచి రికవరీ చేసిన సుమారు రూ.83 లక్షలు నేటికీ సమగ్రశిక్ష ప్రాజెక్టు ఖాతాలోనే ఉందన్నారు. ఈనెలాఖరులో ఉద్యోగుల ఖాతాల్లో దాన్ని జమచేయాలన్నారు. లేనిపక్షంలో కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. డీఎల్ఎంటీ విధుల నుంచి తొలగించిన విజయ్ను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలన్నారు.
సీఆర్టీలకు ప్రిన్సిపాళ్లుగా అవకాశం ఇవ్వండి
కేజీబీవీల్లో సీనియర్ సీఆర్టీలుగా పనిచేస్తున్న వారికి ప్రిన్సిపాళ్లుగా అవకాశం ఇవ్వాలని వారు సమగ్రశిక్ష ఆఫీ్సలో ఏపీసీ తిలక్ విద్యాసాగర్ను కోరారు. చాలా మంది పదేళ్లకు పైగా సీఆర్టీలుగా పని చేస్తున్నారని, వారికి ప్రిన్సిపాళ్లుగా అవకాశం ఇవ్వాలన్నారు. ఖాళీగా ఉన్న స్థానాల్లో ప్రిన్సిపాళ్లు, సీఆర్టీలు, పీజీటీలు, పీఈటీలకు బదిలీలు నిర్వహించాలని తర్వాత ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని ఏపీసీకి వినతిపత్రం అందించారు.