ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కరోనా
ABN , First Publish Date - 2021-08-10T21:24:16+05:30 IST
బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కరోనా పాజిటీవ్గా నిర్ధారణ అయింది.
హైదరాబాద్: బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కరోనా పాజిటీవ్గా నిర్ధారణ అయింది. మంగళవారం ఆయన గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన గాంధీ ఆస్పత్రిలో ఇన్ పేషెంట్గా చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ప్రవీణ్ కుమార్ నల్గొండ సభలో బీఎస్సీలో చేరారు. ఆరోజు నల్గొండ సభలో పాల్గొన్న కొంతమందికి కరోనా పాజిటీవ్ వచ్చినట్లు సమాచారం. ఆ సభకు వచ్చిన వారిలో చాలా మంది కరోనా నిబంధనలు పాటించలేదు. ప్రవీణ్ కుమార్ కూడా మాస్క్ పెట్టుకోకుండానే సభలో పా్ల్గొన్నారు.