నిర్వాసితులకు రూ.239కోట్లు విడుదల చేయాలి
ABN , First Publish Date - 2022-08-08T05:59:45+05:30 IST
పెండ్లిపాకల ప్రాజెక్టు భూనిర్వాసితులకు రూ.239కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కోరారు.
సీఎం కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్యే రవీంద్ర
దేవరకొండ, ఆగ స్టు 7: పెండ్లిపాకల ప్రాజెక్టు భూనిర్వాసితులకు రూ.239కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కోరారు. హైదరాబాద్లో సీఎం కేసీఆర్ ను ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెండ్లిపాకల ప్రాజెక్టు భూసేకరణ పూర్తిచేయాలని, నిర్వాసితులకు పరిహారంతోపాటు గుడితండా, హర్యతండాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటుకు రూ.239కోట్లు కేటాయించాలని సీఎంను కోరినట్లు తెలిపారు.