నిత్యాన్నదాన పథకానికి రూ.75వేలు విరాళం

ABN , First Publish Date - 2022-06-26T04:39:50+05:30 IST

గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో చేపట్టిన శాశ్వత నిత్యాన్నదాన పథకానికి శనివారం చింతకొమ్మదిన్నె మండలం పోలుగారిపల్లె వాసులు శేషారెడ్డి, ధర్మపత్ని నారాయణమ్మ రూ.50116, వారి కుమారులు మాధవరెడ్డి, కోడలు సుమలత (సింగపూర్‌) రూ.25116 విరాళం ఏసీ ముకుందరెడ్డికి అందించారు.

నిత్యాన్నదాన పథకానికి రూ.75వేలు విరాళం
దాతలకు రసీదును అందిస్తున్న దృశ్యం

చక్రాయపేట, జూన్‌ 25: గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో చేపట్టిన శాశ్వత నిత్యాన్నదాన పథకానికి శనివారం చింతకొమ్మదిన్నె మండలం పోలుగారిపల్లె వాసులు శేషారెడ్డి, ధర్మపత్ని నారాయణమ్మ రూ.50116, వారి కుమారులు మాధవరెడ్డి, కోడలు సుమలత (సింగపూర్‌) రూ.25116 విరాళం ఏసీ ముకుందరెడ్డికి అందించారు. ఆలయ ప్రధాన అర్చకులు కేసరి, రాజాస్వామి ఘనంగా పూజలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఏఈ మురళీ కృష్ణారెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T04:39:50+05:30 IST