RTC BUS ప్రమాదంపై మంత్రి ఆళ్లనాని దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2021-12-15T21:00:55+05:30 IST

జంగారెడ్డిగూడెం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

RTC BUS ప్రమాదంపై మంత్రి ఆళ్లనాని దిగ్భ్రాంతి

ఏలూరు: జంగారెడ్డిగూడెం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి.. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం కోసం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే బస్సు బోల్తా ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి అదేశించారు.

Updated Date - 2021-12-15T21:00:55+05:30 IST