బస్సులో చంటిబిడ్డను వదిలి పరారైన ప్రయాణికుడు

ABN , First Publish Date - 2022-02-07T16:03:22+05:30 IST

చెన్నై నుంచి పుదుచ్చేరికి వెళ్తున్న బస్సులో నాలుగు నెలల మగ బిడ్డను ఓ దంపతులకు ఇచ్చి ఓ ప్రయాణికుడు అదృశ్యమయ్యాడు. స్థానిక నీలాంగరైకి చెందిన కృష్ణమూర్తి, సరస్వతి అనే దంపతులు ఆ బస్సు

బస్సులో చంటిబిడ్డను వదిలి పరారైన ప్రయాణికుడు

చెన్నై: చెన్నై నుంచి పుదుచ్చేరికి వెళ్తున్న బస్సులో నాలుగు నెలల మగ బిడ్డను ఓ దంపతులకు ఇచ్చి ఓ ప్రయాణికుడు అదృశ్యమయ్యాడు. స్థానిక నీలాంగరైకి చెందిన కృష్ణమూర్తి, సరస్వతి అనే దంపతులు ఆ బస్సులో పుదుచ్చేరి బయలు దేరారు. ఆదివారం వేకువ జాము నాలుగు గంటలకు రద్దీగా ఉన్న ఆ బస్సులో ఓ యువకుడు చంటి బిడ్డతో ఎక్కాడు. కృష్ణమూర్తి దంపతులకు ఆ చంటి బిడ్డను కాసేపు ఉంచమని ఇచ్చాడు. దీంతో సరస్వతి ఆ బిడ్డను తన వడిలో నిద్రపుచ్చింది. పావుగంట తరువాత ఆ చంటిబిడ్డ ఇచ్చిన యువకుడు మాయమయ్యాడు. దీంతో సరస్వతి, ఆమె భర్త దిగ్ర్భాంతి చెందారు. ఈ విషయం తెలిసిన డ్రైవర్‌, కండెక్టర్‌ బస్సును కోట్టకుప్పం మహిళా పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్ళారు. కృష్ణమూర్తి దంపతులు ఆ బిడ్డను పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని చంటిబిడ్డను విడిచిపెట్టి మాయమైన యువకుడి కోసం గాలిస్తున్నారు. ఆ బిడ్డను మహిళా పోలీసులు సంరక్షిస్తున్నారు.

Updated Date - 2022-02-07T16:03:22+05:30 IST