ఆర్టీసీ బస్సు ఢీ...వివాహిత మృతి
ABN , First Publish Date - 2022-07-02T05:25:58+05:30 IST
బైక్ను వెనుకవైపు నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో సానా కుమారి ((31) అనే వివాహిత మృతి చెందింది.
ప్రొద్దుటూరు క్రైం, జులై 1 : బైక్ను వెనుకవైపు నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో సానా కుమారి ((31) అనే వివాహిత మృతి చెందింది. ఈ ఘటన స్థానిక మైదుకూరురోడ్డులోని ఆరవేటి ఽథియేటర్ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం రామస్వామిపల్లెకు చెంది న కుమారి తన తల్లికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వారం రోజుల క్రితం చాపా డు మండలం నాగులపల్లెకు వచ్చింది. ఈక్ర మంలో శుక్రవారం తల్లిని ప్రొద్దుటూరులోని ఆస్పత్రికి తీసుకొచ్చి, చికిత్స అనంతరం ఆటోలో నాగులపల్లెకు పంపారు. తర్వా త కుమారి తండ్రి నరసింహరెడ్డితో కలిసి బైక్లో నాగులపల్లెకు వెళ్తుండగా ఆరవేటి ఽథియేటర్ వద్దకు రాగానే వెనుకవైపు నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో కుమారికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలు కుమారికి ఇద్దరు సంతానం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ యుగంధర్ చెప్పారు.