Driver, Conductor: మద్యం మత్తులో డ్రైవర్: బస్సు నడిపిన కండక్టర్
ABN , First Publish Date - 2022-08-23T15:48:25+05:30 IST
కాంచీపురం నుంచి పుదుచ్చేరికి ఆదివారం అర్థరాత్రి బయలుదేరిన రవాణా సంస్థ బస్సును కండెక్టర్ నడపటంతో ప్రయాణికులు భీతిల్లారు. ఆ బస్
చెన్నై, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : కాంచీపురం నుంచి పుదుచ్చేరికి ఆదివారం అర్థరాత్రి బయలుదేరిన రవాణా సంస్థ బస్సును కండెక్టర్ నడపటంతో ప్రయాణికులు భీతిల్లారు. ఆ బస్ డ్రైవర్(Bus driver) ధరనేంద్రన్ కాంచీపురంలోనే పీకలదాకా మద్యం తాగడంతో బస్సు నడపలేకపోయాడు. అప్పటికే అందరికీ టికెట్లు ఇచ్చిన కండెక్టర్ హోలీఫేస్ బస్సు నడిపాడు. కాంచీపురం(Kanchipuram) నుంచే ఆ బస్సు నెమ్మదిగా వెళ్లింది, మలుపుల వద్ద బస్సు అటూ ఇటూ ఊగింది. ఈలోగా కొందరు ప్రయాణికులు చూడగా ఆ బస్సును కండెక్టర్ నడుపుతున్నాడని తెలుసుకుని దిగ్ర్భాంతి చెందారు. ఆ కేబిన్లో ఓ మూల డ్రైవర్ ధరనేంద్రన్ మద్యం మత్తులో జోగుతుండటాన్ని గమనించారు. ఈ విషయం తెలుసుకుని ప్రయాణికులంతా వందవాసి వద్ద బస్సు ఆపమన్నారు. ప్రయాణికుల ఆగ్రహానికి భయపడి కండెక్టర్ బస్సు నిలిపేశాడు. ఈలోగా ఈ ఘటనపై ప్రయాణికులు పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ను మందలించారు. ఆ తర్వాత ప్రయాణికులందరూ మరో బస్సులో వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన దిండివనం డిపో ఉన్నతాధికారులు డ్రైవర్ ధరనేంద్రన్ను సస్పెండ్ చేశారు.