ఖమ్మంలో అదుపుతప్పి RTC bus బోల్తా..10 మందికి గాయాలు
ABN , First Publish Date - 2021-11-28T14:13:34+05:30 IST
తల్లాడ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంబేద్కర్నగర్లో అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కావడంతో క్షతగాత్రులను
ఖమ్మం: తల్లాడ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంబేద్కర్నగర్లో అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కావడంతో క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.