వనస్థలిపురంలో ఆర్టీసీ సిటీ బస్సులు ఢీ
ABN , First Publish Date - 2022-01-23T22:13:04+05:30 IST
వనస్థలిపురంలో ఆర్టీసీ సిటీ బస్సులు ఢీ కొన్నాయి. ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఆర్టీసీ బస్ ఢీ కొట్టింది.
హైదరాబాద్: వనస్థలిపురంలో ఆర్టీసీ సిటీ బస్సులు ఢీ కొన్నాయి. ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఆర్టీసీ బస్ ఢీ కొట్టింది. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ముందున్న బస్సును మిధాని డిపో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇబ్రహీంపట్నం డిపో బస్ డ్రైవర్, కండక్టర్కు స్వల్ప గాయాలయ్యాయి. రెండు బస్సుల్లో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో రెండు బస్సుల్లో 60 మంది ప్రయాణికులున్నారు.