రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ కండక్టర్‌ దుర్మరణం

ABN , First Publish Date - 2020-12-03T05:37:08+05:30 IST

జాతీయ రహదారిలో కొత్తూరు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ కండక్టర్‌ దుర్మరణం చెందాడు.

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ కండక్టర్‌ దుర్మరణం
వరహాలనాయుడు (ఫైల్‌)

అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 2: జాతీయ రహదారిలో కొత్తూరు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ కండక్టర్‌ దుర్మరణం చెందాడు. ట్రాఫిక్‌ సీఐ ఎస్‌.బాపూజీ అందించిన వివరాల ప్రకారం... ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్న చీపురుపల్లి వరహాలనాయుడు(50) వడ్లపూడిలో ఉంటున్నాడు. ఎలమంచిలి సమీపంలోని పోతురెడ్డిపాలెంలో వుంటున్న తల్లిని చూసేందుకు బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. కొత్తూరులోని మరిడిమాంబ ఆలయం వద్ద ఓ మహిళను తప్పించబోయి పక్కనే వెళ్తున్న లారీ చక్రాలకు వాహనం హ్యాండిల్‌ తగిలింది. దీంతో అదుపు తప్పి లారీ టైర్ల కిందకు దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వరహాలనాయుడుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ త్రినాథరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-03T05:37:08+05:30 IST