నూజివీడు డిపోలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-04-22T06:53:14+05:30 IST
నూజివీడు ఆర్టీసి డిపోలో విధులు నిర్వహిస్తున్న 10 మంది కార్మికులకు కరోనా సోకడంతో, బుధవారం నుండి వారు హోమ్ ఐసోలే షన్కు వెళ్లారు.
నూజివీడు, ఏప్రిల్ 21 : నూజివీడు ఆర్టీసి డిపోలో విధులు నిర్వహిస్తున్న 10 మంది కార్మికులకు కరోనా సోకడంతో, బుధవారం నుండి వారు హోమ్ ఐసోలే షన్కు వెళ్లారు. ఆర్టీసి కార్మిక సంఘాల నాయకుల నుండి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం మంగళవారం డ్యూటీలు నిర్వహించిన పలువురు కార్మికులకు కరోనా లక్షణాలు కనిపించడంతో, వారందరూ ప్రైవేటుగా వైద్య పరీక్షలు చేయించుకోగా, బుధవారం వారిలో 10 మందికి కరోనా పాజిటివ్ రావడంతో, బుధవారం సాయంత్రం నుండి హోమ్ క్వారంటైన్కు వెళ్లిపోయారు. వారిలో కండక్టర్లు, డ్రైవ ర్లు ఉన్నారు. బస్లో ప్రయాణికులకు, డిపోలోని ఆర్టీసీ కార్మికులకు కరోనా టెస్టులు నిర్వహించాలని పలువురు కార్మికులు కోరుతున్నారు.