రికార్డ్ స్థాయికి ఆర్టీసీ ఆదాయం పెరిగింది: Sajjanar

ABN , First Publish Date - 2021-11-01T17:46:40+05:30 IST

రికార్డ్ స్థాయికి ఆర్టీసీ ఆదాయం పెరిగిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఉద్యోగుల కోసం యాజమాన్యం ఎప్పుడు ముందుంటుందని తెలిపారు.

రికార్డ్ స్థాయికి ఆర్టీసీ ఆదాయం పెరిగింది: Sajjanar

హైదరాబాద్: రికార్డ్ స్థాయికి ఆర్టీసీ ఆదాయం పెరిగిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఉద్యోగుల కోసం యాజమాన్యం ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. సమిష్టిగా కృషి చేసి..ఆదాయాన్ని పెంచడంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. సోమవారం తార్నాక ఆర్టిసీ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవల ప్రారంభ కార్యక్రమంలో సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించుకున్నామని.. అందుకోసం ప్రణాళికలు రూపొందించుకున్నామని తెలిపారు. డయాలసిస్, 24 గంటలు ఫార్మా యూనిట్, ఇప్పుడు ఐసీయూ ఏర్పాటు చేశామన్నారు. రాబోయే మార్చిలోపు కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిద్దుతామని స్పష్టం చేశారు. అందరి కృషితో రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చాబరంరాకె, లేగాటో, డి.బీ.ఎస్ నుంచి దాతలు కూడా ముందుకువచ్చారని సజ్జనార్ తెలిపారు. 

Updated Date - 2021-11-01T17:46:40+05:30 IST