ట్రిపుల్ఐటీలో ఆర్టీసీ ప్రత్యేక టికెట్ కౌంటర్
ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ లో తరగతులకు ఈ నెల 19 నుంచి సెలవు లు ప్రకటించడంతో విద్యార్థులు తమ స్వగ్రా మాలకు వెళ్లేందుకు వీలుగా ఆ రోజు నుంచి ఆర్టీసీ ట్రిపుల్ ఐటీ నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది.
వేంపల్లె, మే 16: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ లో తరగతులకు ఈ నెల 19 నుంచి సెలవు లు ప్రకటించడంతో విద్యార్థులు తమ స్వగ్రా మాలకు వెళ్లేందుకు వీలుగా ఆ రోజు నుంచి ఆర్టీసీ ట్రిపుల్ ఐటీ నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ మేరకు పులివెం దుల డీఎం ఉమామహేశ్వరరెడ్డి నిర్ణయించారు. విద్యార్థు లు నేరుగా టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలుగా ట్రిపుల్ ఐటీలో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటుచేశారు. అసిస్టెంట్ మేనేజర్ కుళ్లాయ ప్ప, ట్రాఫిక్ ఇనస్పెక్టర్ సూర్యనారాయణ ఆ ధ్వర్యంలో డీఎంఈ జీఎఎన రావు, రాజశేఖర్ రెడ్డి విద్యార్థులకు టికెట్లను అందించారు. సెలవులున్న ప్రతిసారి ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.